Thursday, June 18, 2020
నమస్కార్
ఫోన్ రింగ్ అవుతుంది.
ట్రింగ్ ట్రింగ్ అని కాదు... ఏదో ఒక పాట కాదు.. ఏదో ఒక మాట కాదు..
మరి ఏం వస్తుంది.
నమస్కార్, కరోనా వైరస్ యా కోవిడ్ - 19 సే ఆజ్ పూరా దేశ్ లడ్ రహా హై... అంటూ ఇంగ్లీషు, హిందీలలో వచ్చిన తరవాతే ఫోన్ కనెక్ట్ అవుతుంది.
సుమారు మూడు నెలలుగా ఏ ఫోన్ డయల్ చేసినా, కంపెనీ సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఇదే కాలర్ట్యూన్ అయిపోయింది.
మొదట్లో అందరికీ హిందీ లేదా ఇంగ్లీషు భాషలలోనే వచ్చేది. ఆ తరవాత ప్రాంతీయ భాషలలో మొదలైంది.
ఆ గొంతు ఎవరిదో తెలియదు కానీ, ఆ మాటలు విన్నాక మనసు కరోనా భయం నుంచి బయటకు వస్తోంది.
ఆ మాటల మాంత్రికురాలు ఈ మధ్యనే అందరికీ కనిపించింది.
ఆమే ఢల్లీకి చెందిన జస్లీన్ భల్లా..
--------------
ఆ గొంతు ఇంతకుముందే అందరికీ సుపరిచితం.
ఒక ప్రయివేట్ ఎయిర్లైన్స్ సంస్థ అనౌన్స్మెంట్, భారతదేశంలోని ఒక పెద్ద టెలికం సంస్థకు, ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో రైలులో అనౌన్స్మెంట్లతో అందరికీ ఈ గొంతు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు కరోనా కాలర్ ట్యూన్తో ఇంటింటికీ చేరింది ఈ గొంతు.
జస్లీన్ భల్లా సుమారు పది సంవత్సరాలుగా వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ఉన్నారు. ఇప్పుడు కరోనా గురించి అవగాహన కలిగింఏ సందేశం ద్వారా బాగా పాపులర్ అయ్యారు.
ఇండియన్ ప్రెస్వారు ఆమెకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో వెదకి పట్టుకున్నారు. ఆమె గొంతు గురించి... సూపర్బ్, స్పిఫింగ్... అంటూ పొగుడుతున్నారు. ఆమె ఆడియో క్లిపింగులకి టిక్టాక్ వీడియోలు కూడా తయారుచేస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె... నేను కేవలం నా ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాను. నేనెవరో ఎవ్వరికీ తెలియదు. కాని ఒక టీవీ వారు చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ కావలటంతో, నా జీవితంలో చాలా మార్పలు వచ్చాయి... అంటున్నారు.
ఇండియన్ ప్రెస్వారు ఆమెకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో వెదకి పట్టుకున్నారు. ఆమె గొంతు గురించి... సూపర్బ్, స్పిఫింగ్... అంటూ పొగుడుతున్నారు. ఆమె ఆడియో క్లిపింగులకి టిక్టాక్ వీడియోలు కూడా తయారుచేస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె... నేను కేవలం నా ఉద్యోగధర్మం నిర్వర్తిస్తున్నాను. నేనెవరో ఎవ్వరికీ తెలియదు. కాని ఒక టీవీ వారు చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ కావలటంతో, నా జీవితంలో చాలా మార్పలు వచ్చాయి... అంటున్నారు.
చాలామంది డబ్బింగ్ కళాకారులలాగే, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు కూడా బయటి ప్రపంచానికి తెలియరు. ఎందుకంటే మా మాటలకు మా ముఖాలు అవసరం లేదు. కరోనా కారణంగా భయపడుతున్నవారందరికీ అవగాహన కల్పించటం ప్రభుత్వం విధి. ఆ విధిని తన గొంతు ద్వారా నిర్వర్తిస్తున్నానంటారు భల్లా. ఈ సందేశం ద్వారా అందరికీ చేరవయ్యానంటారు ఈమె. తనకు వచ్చిన గుర్తింపు తనకు చాలా ఆనందం కలిగిస్తోందని, కాని కరోనా వాయస్ అనే టాగ్ని మాత్రం ఇష్టపడలేకపోతున్నానంటారు భల్లా.
ఇలా అవకాశం వచ్చింది...
మార్చి నెలలో ఒక స్టూడియో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ నుంచి ఆ ఫోన్. అర్జెంటుగా ఒక మెసేజ్ రికార్డు చేసి పంపాలి అని చెప్పారు. అది 30 సెకన్ల సందేశం అని మా ప్రొడ్యూసర్ చెప్పారు. ఈ సందేశాన్ని ఎంతో మృదువుగా, స్నేహపూర్వకంగా ఉండాలి అని కూడా మా ప్రొడ్యూసర్ ఫోన్లో చెప్పారు. కరోనా వ్యాధి అప్పడు ప్రారంభదశలో ఉంది. అందరినీ ఇంటి దగ్గరే క్షేమంగా ఉండమని చెబుతున్నారు. అప్పడు ... నమస్కార్, కరోనా వైరస్ యా కోవిడ్ - 19 సే ఆజ్ పూరా దేశ్ లడ్ రహాహై... ద ఎంటైర్ కంట్రీ ఈజ్ ఫైటింగ్ అగైనెస్ట్ కరోనా వైరస్... స్టే హోమ్ స్టే సేఫ్... అంటూ ముగుస్తుంది. అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలవద్దని సందేశం పంపింది ప్రభుత్వం.
అలాగే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించమని, చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోమని, భౌతిక దూరం పాటించమని... వీటి వల్ల కరోనాను నివారించవచ్చని చెబుతున్నారు.
నాకు కూడా తెలియదు..
హిందీ, ఇంగ్లీషు భాషలలో రికార్డుఎ చేయమన్నారు. ఒక్కో ఆడియో చేయటానికి నాలుగైదు టేకులు తీసుకున్నాను. పూర్తి చేసి పంపేశాను. ఇంక ఆ విషయం మర్చిపోయాను. రెండు రోజుల తరవాత బంధువులు, స్నేహితులు నాకు ఫోన్ చేసి... మేం ఫోన్ చేయగానే నీ గొంతు వస్తోంది... అని చెప్పటం మొదలుపెట్టారు అని సంతోషంగా చెబుతున్నారు భల్లా. ఈ రికార్డింగు చేసినప్పుడు, దీనిని ఎక్కడ ఉపయోగిస్తారో, ఎందుకు చేస్తున్నారో కూడా భల్లాకు తెలియదట. టెలికాం సంస్థలను, వారి కాలర్ ట్యూన్లు తొలగించి, కరోనా వాయిస్ను కాలర్ట్యూన్గా పెట్టమని ప్రభుత్వం ఆదేశించింది. దానితో భల్లా గొంతు పదేపదే వినిపించటం మొదలైంది.
ప్రస్తతం మరో రెండు సందేశాలను భల్లా గొంతులో రికార్డు చేశారు. డాక్టర్లు, నర్సులు, మిగతా ఫ్రంట్ లైన్ వారియర్లు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా పోరాటం రోగుల మీద కాదు, వ్యాధి నిర్మూలన కోసం మేం కృషి చేస్తున్నాం... అనే సందేశాన్ని అందించాలి. ఈ సందేశం చదివేటప్పుడు నా ఒళ్లు గగుర్పొడిచింది. నేను ఆ సందేశాన్ని కూడా ఎంతో అందంగా, అందరి హృదయాలను హత్తుకునేలా చదివాను.
బాక్స్
నాది నేనే...
నేను ఎవరికి ఫోన్ చేసినా, ముందు 30 సెకన్ల పాటు నా గొంతు నేను వినటం సరదాగా అనిపిస్తుంది. చేతులు కడుక్కో, మాస్కు ధరించు, చేతులను శానిటైజ్ చేసుకో అంటూ నాకు నేనే చెప్పుకోవటం భలేగా అనిపిస్తుంది. ప్రతివారూ భయం నుంచి సాధారణ స్థితిలోకి రావటానికి తియ్యటి మాత్ర చాలా అవసరం. అటువంటి తియ్యటి మాత్రను నా గొంతు ద్వారా అందరికీ అందించే అవకాశం రావటం నిజంగా నా అదృష్టమే.
జస్లీన్ భల్లా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment