Friday, June 26, 2020

వాట్‌ యాన్‌ ఐడియా సర్‌ జీ!



మీరు ఎప్పుడైనా ఒక మంచి లగ్జరీ కారులో జాయ్‌ రైడ్‌ చేశారా! ఆ జాయ్‌ రైడ్‌ చేయటం కోసం మామడి పండ్లు కొన్నారా! కొనకపోతే ఆ అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోండి. 

దుబాయ్‌లో ఒక కంపెనీ మేనేజర్‌ మామిడి పళ్లను లంబోర్గినీ కారులో వినియోగదారులకు అందచేసి, వారితో ఒక చిన్న జాయ్‌ రైడ్‌ చేయిస్తున్నారు. యుఏఈలో ఈ సరదా రైడ్‌ జరుగుతున్న వీడియో ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. యుఏఈలో ఉన్న పాకిస్థానీ చైన్‌ సూపర్‌ మార్కెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముహమ్మద్‌ జహాన్‌జేబ్‌ మామిడిపండ్లను తన సొంత ఆకుపచ్చరంగు లంబోర్గినీ కారులో డెలివర్‌ చేస్తున్నారు.

సరిగ్గా వారం క్రితం అంటే, జూన్‌ 18, 2020 నాడు ఈ కొత్త పనికి శ్రీకారం చుట్టారు జహాన్‌జేబ్‌. పాకిస్థానీ సూపర్‌మార్కెట్‌ ఫేస్‌బుక్‌  పేజీలో ‘న్యూ డెలివరీ వెహికిల్‌’ అంటూ, వారు చేస్తున్న కొత్త పని గురించి వివరించారు. ఆ పని తాలూకు ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్‌ చేశారు. ‘మా సరికొత్త లంబోర్గినీ కారులో మీకు పండ్లు అందచేసి, మీరు జాయ్‌ రైడ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నాం’ అంటూ నోరూరిస్తున్నారు. అయితే ఇందుకోసం భారత కరెన్సీలో 2059 రూపాయల ఖరీదు చేసే మామిడి పండ్లు తప్పనిసరిగా ఆర్డర్‌ చేయాలి. అయితేనేం, కోట్ల విలువ ఉన్న ఈ ఇటాలియన్‌ కారు కొనుక్కోవటం కంటె, ఒకసారి రెండు వేలు కట్టి, చిన్న రైడ్‌ చేస్తే చాలు అనుకుని, మామిడి పండ్ల కోసం ఎగబడుతున్నారు. 


ఇటువంటి కష్టకాలంలో ఆ మేనేజర్‌కి మంచి ఆలోచనే వచ్చింది. ఈ రైడ్‌ చేసినవారంతా, ఆ మేనేజర్‌ చిరునవ్వు గురించి ప్రశంసిస్తూ, వారి వారి వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. కేవలం ఈ రైyŠ  కోసమని రెండు మూడు సార్లు మామిడిపండ్లు ఆర్డర్లు చేస్తున్నామంటూ నెటిజెన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. 

No comments:

Post a Comment